ఉత్తరప్రదేశ్లోని 80 స్థానాలలో కాంగ్రెస పోటీ చేస్తుందని ఎమ్మెల్యే ఆరాధనా మిశ్రా వెల్లడించారు. ప్రియాంకాగాంధీ పార్టీ కార్యకర్తలతో ఇక్కడ సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే. అనంతరం మిశ్రా మాట్లాడుతూ 11 నియోజకవర్గాలలోని ప్రజలతో ప్రియాంకా, సింథియాలు సమావేశమయ్యారని అన్నారు. 80 స్థానాలలోనూ పోటీ చేస్తామని ప్రియాంకా ప్రకటించినట్లు మిశ్రా తెలిపారు. యుపి అత్యధిక లోక్సభ స్థానాలు కలిగి ఉండటంతో ప్రధాని అభ్యర్థిని నిర్ణయించడంలో కీలకం కావడంతో కాంగ్రెస్ గట్టి పోటీనివ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. కాగా, సమాజ్వాది పార్టీ, బహుజన సమాజ్ పార్టీలు కూటమిగా పోటీ చేయనున్న సంగతి తెలిసిందే.