ప్రపంచ ప్రఖ్యాత కమ్యూనిస్టు నేత, కార్మికుల ఆశాజ్యోతి కారల్ మార్క్స్ సమాధిపై దాడి జరిగింది. లండన్లోని హైగేట్ స్మశానంలో ఉన్న ఆయన సమాధిపై కొందరు దుండగులు దాడి చేశారు. శ్మశాన ట్రస్టు నిర్వహకుడు దుంగావెల్ మీడియాకు ఈ వివరాలు వెల్లడించారు. మార్క్స్ 1849 లండన్కు చేరుకుని, తుది శ్వాస విడిచేవరకు అక్కడే నివసించారు. అక్కడి నుంచి కార్మిక ఉద్యమాలు నిర్వహించారు. కీలకమైన గ్రంథాలు రాశారు..సమాధిపై చెక్కి ఉన్న కారల్ మార్క్స్ పేరుపై సుత్తి దెబ్బలతో దాడి చేశారు. దీనితో ఆయన పేరు పూర్తిగా చెరిపివేసినట్టుగా మారింది. ఈ దాడిపై అనేక మంది మేధావులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎన్నోసార్లు మార్క్స్ సమాధిపై పెట్రో బాంబులు, పెయిటింగ్ బాంబు చేసిన దాఖలాలున్నాయి. అనేక దాడులకు తట్టుకొని నిలిచిన చరిత్ర మార్క్స్ సమాధికి ఉందన్నారు. సమాధికి గతంలో ఉన్న శోభ తీసుకొని రావడం సాధ్యం కాదన్నారు.