తమిళనాడులోని ప్రముఖ శరవణ స్టోర్స్ శాఖలపై ఐటీ దాడులలో వందల కోట్ల నగదు, బంగారు గుట్టలు బయటపడుతున్నాయి. చెన్నై, కోయంబత్తూరులో శరవణ స్టోర్లపై, ఆ సంస్థకు సంబంధించిన రియల్ లోటస్ గ్రూప్, జీస్కేర్ల కంపెనీలపైనా దాడులు జరిగాయి. దీంతో అప్రమత్తమైన కంపెనీ యజమానులు డబ్బును, బంగారాన్ని, ఆస్తి పత్రాలను రహస్య ప్రాంతాలకు చేరవేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు కొన్ని వాహనాలను అడ్డుకుని చర్యలు తీసుకున్నారు. సిబ్బందిని విచారించగా, శ్మశానాల్లో డబ్బు, బంగారం దాచినట్లు వెల్లడించడంతో అక్కడికెళ్లి తవ్వకాలు జరిపారు. కొన్ని పాడుబడిన భవనాల్లోనూ డబ్బు, నగలు దాచినట్లు తేలిందని పోలీసులు చెబుతున్నారు. కంపెనీ దీన్ని తనకు అనుకూలంగా మార్చుకుని ఏకంగా వల్లకాటిలో కోట్లకొద్దీ నగదును, బంగారు నగలను, వజ్రాలను పూడ్చిపెట్టింది. ఉప్పందుకున్న ఐటీ అధికారులు శ్మశానంలో తవ్వకాలు జరిపి గుట్టు రట్టు చేశారు.