కేంద్ర ప్రభుత్వంపై ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్న రాఫెల్ ఒప్పందంపై కేంద్రం ఏదో దాస్తుందన్నారు మాజీ రక్షణ శాఖ మంత్రి ఏకె ఆంటోనీ. రాఫెల్ యుద్ధవిమానాల కాంట్రాక్ట్ అనిల్ అంబానికి ఇప్పించటానికి కేంద్రం ప్రత్యేక దృష్టిపెట్టినట్లు స్పష్టమవుతోందన్నారు. ఈ కాంట్రాక్ట్ను ముందుకు తీసుకెళ్లడానికి పీఎంఓకు ఏదైనా ప్రత్యేకమైన ఆసక్తి ఉందా అనే ప్రశ్నలకు ఈ పరిణామం తావిస్తోందన్న అయన రక్షణ ఒప్పందాల బాధ్యత రక్షణ మంత్రిత్వ శాఖదే అని పేర్కొన్నారు. దానిపై ప్రధానమంత్రి కార్యాలయం ఎందుకు ఆసక్తి చూపింది? ఎవరి ప్రయోజనాలను కాపాడుదలచుకుంది అని ప్రశ్నించారు. ఈ ప్రశ్నలన్నింటికీ ప్రధాని సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు.