ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాఫెల్ విషయంలో కేంద్రం ఏదో దాస్తుందన్న ఏకె ఆంటోనీ

national |  Suryaa Desk  | Published : Fri, Feb 08, 2019, 06:00 PM

కేంద్ర ప్రభుత్వంపై ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్న రాఫెల్ ఒప్పందంపై కేంద్రం ఏదో దాస్తుందన్నారు మాజీ రక్షణ శాఖ మంత్రి ఏకె ఆంటోనీ. రాఫెల్ యుద్ధవిమానాల కాంట్రాక్ట్ అనిల్ అంబానికి ఇప్పించటానికి కేంద్రం ప్రత్యేక దృష్టిపెట్టినట్లు స్పష్టమవుతోందన్నారు. ఈ కాంట్రాక్ట్‌ను ముందుకు తీసుకెళ్లడానికి పీఎంఓకు ఏదైనా ప్రత్యేకమైన ఆసక్తి ఉందా అనే ప్రశ్నలకు ఈ పరిణామం తావిస్తోందన్న అయన రక్షణ ఒప్పందాల బాధ్యత రక్షణ మంత్రిత్వ శాఖదే అని పేర్కొన్నారు. దానిపై ప్రధానమంత్రి కార్యాలయం ఎందుకు ఆసక్తి చూపింది? ఎవరి ప్రయోజనాలను కాపాడుదలచుకుంది అని ప్రశ్నించారు. ఈ ప్రశ్నలన్నింటికీ ప్రధాని సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com