పండించిన పొగాకు పంటను పొలాల్లో పందిర్లపై ఎండబెట్టగా చోరీకి గురైన ఘటనలు యద్దనపూడి మండలంలో చోటుచేసుకున్నాయి. రెండు కేసులు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శుక్రవారం తెలిపారు. గన్నవరం లో రైతు ప్రత్తిపాటి రాంబాబు పొగాకు తోటలో పందిర్లపై ఎండబెట్టిన రూ. లక్ష విలువైన 10 క్వింటాళ్లు, చిమటావారి పాలేనికి చెందిన రైతు వెంకట రత్నం పొలంలో రూ. 80 వేల విలువచేసే ఎనిమిది క్వింటాళ్ల బర్లీ తాళ్ళు చోరీకి గురయ్యాయి.