ఎన్టీఆర్ జిల్లాలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాద్ భార్య శిరీష ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. శుక్రవారం ఉదయం జిల్లాలోని జి.కొండూరులో ఎమ్మెల్యే సతీమణి ఎన్నికల ప్రచారం చేశారు. తన భర్తను గెలిపించాలని కోరుతూ శిరీష ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. గడప గడపకు తిరుగుతూ ఎన్డీఏ ప్రభుత్వం వల్ల కలిగే ప్రయోజనాలు ఎమ్మెల్యే భార్య వివరిస్తున్నారు. సూపర్ సిక్స్ పథకాలను మహిళలు, పేదలకు వివరిస్తూ ప్రచారంలో కృష్ణ ప్రసాద్ సతీమణి శిరీష దూసుకుపోతున్నారు. శిరీషతో ఎన్నికల ప్రచారంలో పెద్ద సంఖ్యలో టీడీపీ శ్రేణులు పాల్గొంటున్నారు.