సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రవర్తన నియమావళి ఉల్లంఘనలు జరగకుండా ఎన్నికల సంఘం పక్కాగా ఏర్పాట్లు చేసింది. సాంకేతికతను జోడించి ఓటింగ్ ప్రక్రియను సులభతరం చేయడమే కాకుండా ఎన్నికలు పారదర్శకంగా జరిగేందుకు కృషి చేస్తోంది. ఇందులో భాగంగా ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు, వివిధ రాజకీయ పార్టీలు.. నామినేషన్ల దాఖలు నుంచి ర్యాలీలు, ఎన్నికల ప్రచారానికి అనుమతులు, తదితర వాటికి సంబంధించి సువిధ పోర్టల్ను అందుబాటులోకి తెచ్చింది. ఈ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకుంటే సంబంధిత అధికారులు పరిశీలించి 48 గంటల్లో అనుమతులు జారీ చేస్తారు. అన్నిరకాల ప్రచార అనుమతులకు అభ్యర్థులు ముందుగా జ్ట్టిఞట/టఠఠిజీఛీజ్చి.్ఛఛిజీ.జౌఠి.జీుఽ వెబ్సైట్లో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. అయితే ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు మాన్యువల్గా కూడా దరఖాస్తులు చేసుకున్నా అనుమతులు ఇస్తారు.