అక్రమంగా తరలిస్తున్న రూ.1.60 లక్షల విలువైన తెలంగాణ మద్యం సీసాలను స్వాధీనం చేసుకొని నలుగురిపై కేసు నమోదు చేసినట్టు విజయవాడ ఎన్పోర్స్మెంట్ స్పెషల్ సూపరింటెండెంట్ భార్గవ్ తెలిపారు. వత్సవాయికి చెందిన వల్లంకొండ రమణయ్యకు చెందిన వరి గడ్డివామిలో గ్రామానికి చెందిన రమణయ్యతో పాటు చీకటిమల్ల గోపి, ఎస్కె నాగుల్, వల్లంకొండ రమే్షలు తెలంగాణకు చెందిన మద్యం 1,190 సీసాలు అట్టపెట్టెల్లో పెట్టి గడ్డివామిలో డంప్ చేసినట్టు భార్గవ్ తెలిపారు. అక్రమంగా నిల్వ ఉంచిన సీసాలను స్వాధీనం చేసుకొని నిందితులపై కేసు నమోదు చేసినట్టు ఆయన తెలిపారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఈ చీకటి వ్యాపారం చేస్తున్నట్టు తెలుస్తోంది. మద్యం సీసాలను తెలంగాణ నుంచి వత్సవాయికి తరలించి వైసీపీ పెద్దల ఆదేశానుసారం దాచినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.