హిందూపురం మండలం తూమకుంట గ్రామానికి చెందిన నారాయణప్ప (42) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఈయన రెండు రోజులుగా కనిపించకుండా పోయాడు. కుటుంబ సభ్యులు తెలిసిన చోట్లల్లా వెదుకుతున్నారు. ఈ క్రమంలో గురువారం కర్ణాటక సరిహద్దున ఉన్న పెట్రోల్ బంక్ ఎదురుగా ఓ కాలువలో నారాయణప్ప మృతదేహం లభ్యమైంది. గౌరిబిదనూరు పోలీసులు కేసు నమోదు చేసి. మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.