ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రూ.5 కోసం ధర్మవరంలో దారుణ హత్య

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Apr 17, 2024, 07:54 PM

శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలో దారుణం జరిగింది. రైల్వేస్టేషన్‌ మార్గం కొత్తపేట కూడలి దగ్గర రూ.5 విషయంలో గొడవతో హత్య జరిగింది. ధర్మవరంలోని పాత బస్టాండ్‌ ప్రాంతంలో నివాసం ఉంటున్న శ్రీనివాస్‌రెడ్డి మదనపల్లి వెళ్లి తిరుగు ప్రయాణంలో రైలులో ధర్మవరం వచ్చారు. రైల్వేస్టేషన్‌ వెలుపల కొత్తపేట ఆటో స్టాండ్‌ దగ్గర నుంచి పట్టణంలోకి వచ్చేందుకు ఆటో డ్రైవర్‌‌ లోకేంద్రతో బేరమాడారు. టౌన్‌లోకి వెళ్లేందుకు రూ.15 ఛార్జీ అవుతుందని ఆటో డ్రైవర్‌ చెప్పాడు. రూ.10 ఇస్తానని శ్రీనివాసరెడ్డి ఆటో డ్రైవర్‌తో అన్నాడు.


ఇలా రూ.5 విషయంలో మాటా మాటా పెరిగి శ్రీనివాసరెడ్డిపై లోకేంద్ర, అతడి స్నేహితుడు విష్ణు దాడి చేశారు. కర్ర, రాళ్లతో కొట్టడంతో ఘటనా స్థలంలోనే శ్రీనివాసరెడ్డి చనిపోయాడు. వారు మృతదేహాన్ని రోడ్డు పక్కన పడేసి వెళ్లిపోయారు. ఈ విషయాన్ని స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిసరాలను పరిశీలించి విచారణ చేశారు. ఆటో డ్రైవర్‌, అతని స్నేహితుడు గంజాయి మత్తులో ఉన్నారని స్థానికులు పోలీసులకు తెలిపారు. మృతదేహాన్ని పోలీసులు పరిశీలించి పోస్టుమార్టం కోసం ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.


శ్రీనివాసరెడ్డి ధర్మవరంలో ప్రైవేటు వాహన డ్రైవర్‌గా పనిచేస్తున్నారు.. ఆయన వివాదాలకు దూరంగా ఉంటారని.. చాలా మంచి వ్యక్తి అని స్థానికులు చెబుతున్నారు. అతడి భార్య శారద ఫిర్యాదుతో రెండో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. ఈ హత్ తర్వాత పారిపోయిన నిందితులను ధర్మవరం కేహెచ్‌ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ దగ్గర పోలీసులు అరెస్ట్ చేశారు. ఆటో కిరాయి విషయంలో గొడవకు దిగి శ్రీనివాసులరెడ్డిని ఆటో డ్రైవర్‌ లోకేంద్ర, అతని స్నేహితుడు విష్ణు కర్రలు, రాళ్లతో కొట్టి హత్య చేశారని తెలిపారు. గంటల వ్యవధిలో నిందితులను అరెస్టు చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com