ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆర్‌బీఐ కొత్త రూల్.. బ్యాంకులు ఆ వివరాలన్నీ చెప్పాల్సిందే.. అక్టోబర్ నుంచే

business |  Suryaa Desk  | Published : Wed, Apr 17, 2024, 07:22 PM

రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా మరో కీలక నిర్ణయం తీసుకుంది. బ్యాంకులు, ఫైనాన్సియల్ సంస్థలకు కొత్త రూల్స్ తీసుకొస్తోంది. వివిధ రుణాలకు సంబంధించి ఛార్జీల వంటి పూర్తి వివరాలు లోన్ స్టేట్‌మెంట్లో పొందుపర్చాలని బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలకు ఆదేశించింది. ఈ కొత్త రూల్స్ అక్టోబర్ 1, 2024 నుంచి అమలులోకి రానున్నయి. రుణాలకు సంబంధించిన ప్రాథమిక వివరాలతో పాటు ఛార్జీలు ఎంత, వార్షిక ఖర్చు ఎంత? దేనికి ఎంత ఛార్జీలు వసూలు చేస్తున్నాం? వంటి వివరాలు లోన్ స్టేట్‌మెంట్‌లో స్పష్టంగా ఉండేలా చూడాలని తెలిపింది. వాటితో పాటు.. లోన్ రికవరీ ఏజెంట్ల పాలసీ, సమస్యలపై ఫిర్యాదు చేసేందుకు ఎవరిని సంప్రదించాలి, ఇతరులకు లోన్ విక్రయించే అవకాశాల గురించి సైతం స్పష్టంగా తెలియజేయాలని బ్యాంకులను ఆదేశించింది ఆర్‌బీఐ. బ్యాంకింగ్ వ్యవస్థలో పారదర్శకత కోసం కొత్త మార్గదర్శకాలు రూపొందించినట్లు ఆర్‌బీఐ తెలిపింది.


ఈ కొత్త రూల్ అమలు చేసేందుకు బ్యాంకులు వీలైనంత త్వరగా కొత్త విధానాన్ని రూపొందించాలని ఓ ప్రకటనలో పేర్కొంది ఆర్‌బీఐ. అక్టోబర్ 1, 2024 లేదా ఆ తర్వాత జారీ చేసే రిటైల్, ఎంఎస్ఎంఈ లోన్లతో పాటు, ప్రస్తుత లోన్లకు సైతం ఈ మార్గదర్శకాలు వర్తిస్తాయని తెలిపింది. బ్యాంకులు, ఫైనాన్షియల్ సంస్థలు కచ్చితంగా ఈ కొత్త మార్గదర్శకాలను పాటించాల్సిందేనని స్పష్టం చేసింది. ఇలా చేయడం ద్వారా రుణాలు తీసుకునే వారికి లోన్ గురించి స్పష్టంగా అర్థమవుతుందని రిజర్వ్ బ్యాంక్ తెలిపింది. తమకు ఎంత రుణం వచ్చింది, ఛార్జీలు, రుసుములు ఎంత కట్ అవుతున్నాయి? లోన్ తిరిగి ఎంత మొత్తం చెల్లిచాల్సి వస్తోంది అనే వివరాలు తెలుసుకునే వాలు కలుగుతుంది. దీని ద్వారా కస్టమర్లు లోన్లపై తెలివైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ కొత్త రూల్ అన్ని బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలకు వర్తిస్తుందని ఆర్బీఐ తెలిపింది.


ప్రస్తుతం బ్యాంకులు రుణాల స్టేట్‌మెంట్‌లో ఛార్జీలకు సంబంధించిన వివరాలు పొందుపరుస్తున్నాయి. అయితే రిజర్వ్ బ్యాంక్ తీసుకొస్తున్న కొత్త మార్గదర్శకాలతో యానువల్ పర్సెంటేజ్ రేట్ బహిర్గతం కానుంది. ఇది రుణ గ్రహీతకు రుణాలపై వార్షిక ఖర్చులను తెలియజేస్తుంది. ఇందులో వడ్డీ రేటుతో పాటు ఇతర రుసుములకు సంబంధించిన పూర్తి వివరాలు ఉంటాయి. ఇన్సూరెన్స్, లీగల్ ఛార్జీలు వంటి థర్డ్ పార్టీ సేవల కోసం వసూలు చేసే ఫీ కూడా ఏపీఆర్ లో ప్రత్యేక కాలమ్ లో పొందుపర్చాలని స్పష్టం చేసింది. ఏపీఆర్ ద్వారా బ్యాంకుల లోను రుసుములు ఎంత ఉన్నాయో కస్టమర్ సులభంగా తెలుసుకునే వీలుకలుగుతుందని తెలిపింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com