ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చంద్రబాబు ఒక ఊసరవెల్లి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Apr 28, 2023, 01:17 PM

ఊసరవెల్లిలా రంగులు మార్చే వ్యక్తి చంద్రబాబు ఒక్కడే అని డిప్యూటీ సిఎం, మైనార్టీ శాఖ మంత్రి  ఎస్బీ అంజాద్‌ బాషా విమ‌ర్శించారు. అంజాద్ బాషా మీడియాతో మాట్లాడుతూ.....  ధరణికోటలో చంద్రబాబు మైనార్టీలతో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసి ఎన్నడూ లేని ప్రేమ ఒలకబోస్తున్నాడు. చంద్రబాబు ఒక ఊసరవెల్లి..అవసరం ఉన్నప్పుడు రంగులు మార్చే వ్యక్తి,  మళ్లీ గద్దెనెక్కాలంటే ఖచ్చితంగా మైనార్టీల ఓట్లు అవసరమని ఇప్పుడు చంద్రబాబు గ్రహించాడు.  అందుకే చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్‌ వల్లమాలిన ప్రేమను చూపిస్తున్నారు,  దీన్ని రాష్ట్రంలోని ప్రతి ముస్లిం మైనార్టీ సోదరులు గమనించాలి.  జగన్‌ గారు అన్నీ అబద్దాలే చెప్తున్నారని చంద్రబాబు ఆరోపిస్తున్నారు.  మహానేత డాక్టర్ వైయ‌స్సార్‌ శాసనసభ సాక్షిగానే చంద్రబాబు నిజం మాట్లాడితే ఆయన తల వెయ్యి వక్కలవుతుందని చెప్పారు. అలాంటి వ్యక్తి వైయ‌స్ జగన్‌గారి గురించి మాట్లాడే అర్హత లేదు.  మైనార్టీలను ఎక్కువ న్యాయం చేసిన పార్టీ టీడీపీ అనడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుంది అని అన్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com