ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గ్యాప్‌ సర్టిఫికేషన్‌ రైతులకి ఎంతో ఉపయోగకరం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Apr 28, 2023, 01:19 PM

 ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఇండ్‌ గ్యాప్‌ ధృవీకరణ కార్యక్రమాన్ని తాడేప‌ల్లి క్యాంపు కార్యాల‌యంలో ప్రారంభించారు.   గ్యాప్‌ సర్టిఫికేషన్‌ ద్వారా మన రాష్ట్ర అన్నదాతలు కష్టపడి నాణ్యమైన ప్రమాణాలతో పండించిన పంట దిగుబడులను తమకు జారీ చేసిన ధృవీకరణ పత్రముల ఆధారంగా ప్రీమియం ధరకు వారికి నచ్చిన చోట దేశీయంగా మాత్రమే కాకుండా యూరప్, యూఎస్‌తో సహా వందకు పైగా ఇతర దేశాలకు కూడా ఎగుమతి వ్యాపారం చేసుకునే వెసులుబాటును ఏపీ ప్రభుత్వం కల్పిస్తుంది.గ్యాప్‌ సర్టిఫికేషన్‌లో భాగంగా పండ్లు, కూరగాయలు, సంయోగ పంటలు, తేయాకు, గ్రీన్‌ కాఫీ, సుగంధ ద్రవ్యాలు అనే ఐదు విభాగాలుగా ధృవీకరణ చేయడం జరుగుతుంది. ఈ ధృవీకరణను వ్యక్తిగత రైతులు, రైతు బృందాల చేత చేయించవచ్చు. మన రాష్ట్రంలో ఇండ్‌ గ్యాప్‌ ధృవీకరణ పథకం కింద ఏపీఎస్‌వోపీసీఏ ధృవీకరణ సేవలు అందిస్తుంది. ఏపీ ప్రభుత్వం ఇండ్‌ గ్యాప్‌ అమలుకోసం సుస్ధిర వ్యవసాయ ఆహార వ్యవస్ధలు అనే శీర్షికతో ఎఫ్‌ఏవో–టీసీపీ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇండ్‌ గ్యాప్‌ ధృవీకరణ ఒప్పంద పత్రాలను సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌ సమక్షంలో మార్చుకున్న క్వాలిటీ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా ఛైర్మన్‌ జక్సయ్‌ షా, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com