ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పవన్‌ను విమర్శించేవారు సూడో సెక్యులర్స్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Sep 30, 2024, 07:45 PM

తిరుమల లడ్డూ వ్యవహారం నేపథ్యంలో.. సనాతన ధర్మంపై దాడి చేస్తే చూస్తూ ఊరుకునేది లేదంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇటీవల హెచ్చరించిన విషయం తెలిసిందే. అయితే ఆయనపై కొందరు విమర్శలకు దిగిన నేపథ్యంలో పవన్ సోదరుడు నాగబాబు స్పందించారు. హిందువులే హిందువులను అవమానించడం సబబుకాదని ఆయన వ్యాఖ్యానించారు.


పవన్ కల్యాణ్ అదే విషయాన్ని ప్రస్తావించారని, పవన్ కల్యాణ్ అసలైన సెక్యులర్ అని సమర్థించారు. పవన్‌ను విమర్శించేవారు సూడో సెక్యులర్స్ అని ఎద్దేవా చేశారు. ‘‘డిక్లరేషన్ గురించి ఒక్కటే మాట.. అన్నీ మతాలను అందరూ గౌరవించాలి’’ అని నాగబాబు వ్యాఖ్యానించారు. జాతీయ స్థాయిలో ఖచ్చితంగా హిందూధర్మ పరిరక్షణ కమిటీ ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన సోమవారం సోషల్ మీడియా వేదికగా స్పందించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com