భారత దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఎన్టీఆర్ ట్రస్ట్ మానవత్వంతో ప్రజలకు సేవలు అందిస్తుందని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలిపారు. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ బ్లడ్ బ్యాంక్తో పాటు అంబులెన్స్ సేవలను నేడు రాజమండ్రిలో ప్రారంభించిన నేపథ్యంలో అయన మాట్లాడారు. ఎన్టీఆర్ ట్రస్ట్కు ముఖ్యమంత్రి చంద్రబాబు సాయం అందిస్తున్నారని అన్నారు. అత్యాధునిక టెక్నాలజీతో రాజమండ్రిలో బ్లడ్ బ్యాంక్ ఏర్పాటుచేశారని గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు.