ప్రజలకు ఎల్లప్పుడూ ఎన్టీఆర్ ట్రస్ట్ అండగా ఉంటుందని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి తెలిపారు. చంద్రబాబు జైల్లో ఉన్న సమయంలో రాజమహేంద్రవరం ప్రజలు తమకు అండగా ఉన్నారని చెప్పారు. ఈ సందర్భంగా భువనేశ్వరి మాట్లాడుతూ... చంద్రబాబు జైల్లో ఉన్న 53 రోజులు చాలా బాధపడ్డామని ఆవేదన వ్యక్తం చేశారు. తాను, తన కోడలు రాజమండ్రిలో ఉన్నప్పుడు ప్రజలు తమకు దైర్యంగా ఉన్నారని గుర్తుచేసుకున్నారు. ఈ నేపథ్యంలో వారికి సాయంగా నిలిచేందుకు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ బ్లడ్ బ్యాంక్తో పాటు అంబులెన్స్ సేవలను రాజమండ్రిలో ప్రారంభిస్తున్నట్లు తెలియజేసారు.