కడప జిల్లా, వీరపునాయునిపల్లె మండలంలోని ఇం దుకూరు సమీపంలో జరుగుతున్న గ్రీనఫీల్డ్ రోడ్డు పనులను గ్రామస్థులు ఆదివారం అడ్డుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.... అనుమతులు లేకుండా కొండలను కొల్లగొడుతున్నా అధికారులు నిద్రపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని, మట్టి టిప్పర్లను అడ్డుకున్నామన్నారు. కొండను తవ్వితే పశువులకు మేత ఉండదని, వాటిపై జీవనం సాగించే పేద ప్రజలు రోడ్డున పడా ల్సి వస్తుందన్నారు.
మట్టి తవ్వకాలు ఇలాగే కొనసాగిస్తే కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆమరణ నిరాహారదీక్ష చేస్తామని గ్రామప్రజలు తెలిపారు. మా ఆవేదనను అర్థంచేసుకొని గ్రీన ఫీల్డ్ రోడ్డుకు మట్టిని తరలిపోకుండా కాపాడాలని విన్నవించుకుంటున్నారు. అనంతరం రెవెన్యూ అధికారులు మట్టి తరలిస్తున్న ప్రాంతానికి చేరుకొని టిప్పర్లను బయటకు పంపించారు. మట్టి తరలించడానికి ప్రయత్నిస్తే చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.