దళితులకు సంబంధించి నిన్న టీడీపీ నేతలు ఒక పుస్తకాన్ని విడుదల చేసుకున్నారు. పేదల పెన్నిధి, దళితుల ఆత్మబంధువు అంటూ చంద్రబాబును ఆ పుస్తకంలో పేర్కొనడాన్ని చూసి రాష్ట్రప్రజలంతా పగలబడి నవ్వుకుంటున్నారు. పుస్తకంలో అచ్చుతప్పి పడి ఉంటుందని.. దళితుల పట్ల రాబంధువు చంద్రబాబు అనడం నూటికి నూరుశాతం వర్తిస్తుందని దళిత మేధావులు అంటున్నారు. అందుకే, ఈ సందర్భంలో మేము చంద్రబాబును సూటిగా ప్రశ్నిస్తున్నాం. 14 ఏళ్లు సీఎంగా, ఫార్టీ ఇయర్స్ పొలిటికల్ ఇండస్ట్రీ అని చెప్పుకునే బాబు దళితులకు చేసిన మేలేంటి..? అని అడుగుతున్నాము అని వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ ప్రశ్నించారు.