నేడు (సోమవారం) రాజమండ్రిలో నారా భువనేశ్వరి పర్యటించారు. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ బ్లడ్ బ్యాంక్తో పాటు అంబులెన్స్ సేవలను నారా భువనేశ్వరి ప్రారంభించారు. ప్రజల రుణం తీర్చుకుంటున్నామని అన్నారు. హైదరాబాద్, విశాఖపట్నం, తిరుపతి బ్లడ్ బ్యాంక్ల ద్వారా ఎనిమిది లక్షల మందికి ఉచితంగా రక్తం అందించామని ప్రకటించారు. 1938 మంది అనాథ విద్యార్థులకు ఉచిత విద్య అందిస్తున్నామని వివరించారు. 5 కోట్ల స్కాలర్ షిప్లు ఇచ్చామని అన్నారు. ఎన్టీఆర్ సంజీవిని క్లినిక్ల ద్వారా లక్ష మందికి, మెబైల్ క్లినిక్ ద్వారా 70 వేల మందికి ఉచిత వైద్యం అందించామని అన్నారు. కుప్పంలో మహిళలకు ఉచిత కుట్టు శిక్షణ ఏర్పాటు చేశామని స్పష్టంచేశారు. ఏపీ, తెలంగాణల్లో 20 లక్షల మందికి విపత్తు సాయం అందించామని అన్నారు. విజయవాడలో వరదల సమయంలో లక్ష లీటర్ల పాలు, తాగు నీరు సరఫరా చేశామని భువనేశ్వరి వెల్లడించారు.