ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు: తహశీల్దార్ మునివేలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Oct 20, 2022, 12:07 PM

తాడిపత్రి: టపాకాయలు అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని తహశీల్దార్ మునివేలు పేర్కొన్నారు. తసిల్దార్ కార్యాలయంలో విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ నిభందనల మేరకే టపాకాయలు విక్రయించాలన్నారు. టపాకాయలు విక్రయశాలల వద్ద తగు జాగ్రత్తలు పాటించాలన్నారు. రద్దీ రోజులలో వాహనాల పార్కింగ్ విక్రయశాలలకు దూరంగా ఉండేలా ఏర్పాటు చేసుకోవాలన్నారు. భద్రతా ఏర్పాట్లలో భాగంగా అగ్నిమాపక శాఖ నిబంధనల మేరకు బకెట్లలో ఇసుక, నీరు తదితర వాటిని అందుబాటులో వుంచుకోవాలన్నారు. ప్రధానంగా అధిక ధరలకు విక్రయించడం, పాస్టిక్ కవర్లు వాడడం జరగరాదన్నారు. అనుమతి ఉన్న ప్రాంతాల్లో తప్ప మరెక్కడ టపాకాయలు విక్రయించరాదన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోబడునని తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com