వరుసకు మరదలైన మహిళను బావ హత్య చేసి ఆపై అతను ఆత్మహత్య చేసుకున్న సంఘటన గుత్తి మండ. లంలోని పూలకుంట గ్రామంలో బుధవారం సాయంత్రం చోటుచేసు కుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన మేరకు వివరాలు. పూలకుంట గ్రామానికి చెందిన నాగేంద్ర(45)కు వరుసకు మరదలు అయిన సుంక రత్నమ్మ(38)తో వివాహేతర సంబం ధం ఉండేది. ఐతే ఆమె మరొకరితో చనువుగా ఉందన్న అనుమానంతో నాగేంద్ర పొలం పనిలో ఉన్న సుంక రత్నమ్మ తో గొడవపడి ఆవేశంతో రాయితో తలపై కొట్టడంతో ఆమె తీవ్రమైన గాయంతో అక్కడికక్కడే మృతిచెందింది. దీంతో నాగేంద్ర భయంతో అదే పొలంలో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకు న్నాడు. గ్రామస్తులు సమాచారం అందుకున్న సిఐ వెంకటరామి రెడ్డి, ఎస్సై ఆర్. శ్రీనివాసులు అక్కడికి చేరుకుని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.