ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆటోలో నుంచి తూలి కిందపడి మహిళ మృతి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Sep 26, 2022, 01:54 PM

విశాఖపట్నం: సంతకు వెళ్లి తిరుగు ప్రయాణంలో ఆటోలో వస్తున్న ఓ మహిళ తూలి కిందపడి మృతి చెందిన సంఘటన ఆదివారం సాగరం కాలనీ వద్ద చోటు చేసుకుంది. ఈ మేరకు స్థానిక ఎస్సై దామోదర్ నాయుడు సాయంత్రం అందించిన వివరాలు ప్రకారం.. మాడుగుల మండలం వీరనారాయణ గ్రామానికి చెందిన బొడ్డేటి నాగయ్యమ్మ(59), యధా ప్రకారం ఆదివారం వంట్ల మామిడిలో జరిగిన వారవ సంతకు వెళ్లి మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో తిరిగి ఆటోలో వస్తుండగా మాడుగుల మండలం సాగరం పంచాయతీ సాగరం కాలనీ మదమాంబ నాటు కోళ్లు ఫారం వద్ద ఆటోలో నుంచి మహిళ తుళ్ళి రోడ్డుపై పడి మృతి చెందింది. వీరనారాయణ గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ ఏసుబాబు నిర్లక్ష్య డ్రైవింగ్ మూలంగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని చెప్పారు. మేరకు మృతురాలు కుమారుడు రాము ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేసినట్టు చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com