ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జాబ్ రావాలంటే.. జగన్ పోవాలంటూ టీడీపీ నిరసన

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Sep 15, 2022, 01:33 PM

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఇవాళ ప్రారంభమయ్యాయి. తుళ్లూరు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వద్ద నిరుద్యోగ సమస్యపై టీడీపీ నిరసన వ్యక్తం చేశారు. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి చెప్పిన 2.30లక్షల ఉద్యోగాలు, జాబ్‌ క్యాలెండర్‌ ఎక్కడ? అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. జాబ్‌ రావాలంటే జగన్‌ పోవాలంటూ నినాదాలు చేశారు.


ఈ సందర్భంగా పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ.. ప్రతిపక్షంలో ఉండగా జాబ్‌ క్యాలెండర్‌ ఇస్తామన్న జగన్‌.. అధికారంలోకి వచ్చాక ఆ హామీ నెరవేర్చలేదన్నారు. ఉద్యోగాల భర్తీ చేపట్టలేదని విమర్శించారు. తెదేపా హయాంలో డీఎస్సీలు వేశామని, నిరుద్యోగ భృతి ఇచ్చామని గుర్తు చేశారు. జాబ్‌ ఎక్కడ? జగన్‌ ఎక్కడ? అని అసెంబ్లీలో ప్రశ్నిస్తామని ఆయన వ్యాఖ్యానించారు.


ఉద్యోగాల భర్తీని డిమాండ్ చేస్తూ తెలుగు యువత, టీఎన్ఎస్ఎఫ్ నేతలు అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. వెలగపూడి చెక్ పోస్ట్ వద్ద శ్రీరామ్ చినబాబు, ఇతర నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు, తెలుగు యువత శ్రేణులకు మధ్య తీవ్ర తోపులాట జరగడంతో పలువురు నేతలకు గాయాలయ్యాయి. తెలుగు యువత నాయకులను అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ వద్ద భారీగా పోలీసులు మోహరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com