మొబైల్ ఫోన్ల రికవరీ కోసం జిల్లాలో ప్రత్యేక టీంను ఏర్పాటు చేయడం జరిగిందని జగిత్యాల ఎస్పీ అశోక్ కుమార్ సోమవారం ఒక ప్రకటనలో అన్నారు. గత సంవత్సరం పోర్టల్ ప్రారంభమైన నాటి నుండి ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 411 ఫోన్ లను రికవరీ చేసి బాధితులకు అందించామన్నారు. ఎవరైన మొబైల్ పోగొట్టుకున్న లేదా దొంగిలించబడిన వెంటనే సిఈఐఆర్ పోర్టల్ లో బ్లాక్ చేయాలాన్నారు.