నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గం వేసవి కాలంలో ప్రజల దాహార్తిని తీర్చడం కోసం ఏవీఏం పాఠశాల 1990-1991 పూర్వ విద్యార్థులు ఏర్పాటు చేసిన చలివేంద్రం కేంద్రాన్ని గురువారం ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నిర్వాహకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పూజర్ల శంభయ్య , స్థానిక కౌన్సిలర్లు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.