మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, తనకు "దృశ్యం" వంటి సూపర్ డూపర్ హిట్ ఇచ్చిన డైరెక్టర్ జీతూ జోసెఫ్ డైరెక్షన్లో "రామ్" అనే సినిమాను 2019లో ప్రకటించాడు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఆ సినిమా నుండి ఎలాంటి అప్డేట్ రాలేదు. అసలాసినిమా పట్టాలెక్కిందా? లేదా అన్న ప్రశ్నకు సమాధానం కూడా తెలియక ఇన్నాళ్లు ఆడియన్స్ కన్ఫ్యూషన్ లో ఉన్నారు.
లేటెస్ట్ గా ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కెళ్లబోతుందని న్యూస్ వినిపిస్తుంది. ఆగస్టు నెల నుండి స్టార్ట్ అవ్వబోయే ఈ మూవీ షూటింగ్ ఎక్కువ శాతం లండన్, పారిస్, మొరాకో లలో సుమారు రెండు నెల్ల పాటు జరగబోతుందట. ఇందులో త్రిష హీరోయిన్ గా నటిస్తుండగా, అభిషేక్ ఫిలిమ్స్, ప్యాషన్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.