2004 లో వచ్చిన "వర్షం" సినిమాలో కలిసి నటించినప్పటి నుండి ప్రభాస్, గోపీచంద్ లిద్దరు ప్రాణస్నేహితులుగా మెలుగుతున్న విషయం అందరికి తెలుసు. ఈ విషయాన్ని పలు సందర్భాల్లో గోపీచంద్, ప్రభాస్ బాహాటంగానే చెప్పారు కూడా. వర్షం తదుపరి వీరిద్దరూ కలిసి నటించిన దాఖలాలు లేవు. కానీ, వీరిద్దరిని అభిమానులు ఒకే స్క్రీన్ పై చూడాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఈ విషయంపై "పక్కా కమర్షియల్" ప్రమోషన్స్ లో పాల్గొంటున్న గోపీచంద్ కు ఒక ప్రశ్న ఎదురైంది. ఇందుకు సమాధానంగా గోపీచంద్ ఇచ్చిన ఆన్సర్ ప్రేక్షకుల హృదయాలను దోచుకుంటుంది. ఆయన ఏమన్నారంటే... ప్రభాస్ అడగాలే కానీ, ఆయన సినిమాలో మరోసారి విలన్గా నటించడానికి కూడా సిద్ధం... అని చెప్పారు. ఈ ఆన్సర్ ప్రభాస్, గోపీచంద్ మధ్య ఉన్న స్నేహానుబంధానికి రుజువుగా నిలుస్తుంది.
పోతే..., మారుతి డైరెక్షన్లో గోపీచంద్, రాశీఖన్నా జంటగా నటించిన పక్కా కమర్షియల్ మూవీ జూలై 1వ తేదీన ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతుంది.