కొరియోగ్రాఫర్ గా, నటుడిగా, డైరెక్టర్ గా మూడు విభిన్న పాత్రలను పోషించిన ప్రభుదేవా ఈ మూడు రంగాల్లోనూ సూపర్ సక్సెస్ అయ్యాడు. చాన్నాళ్ల తర్వాత ప్రభుదేవా సిల్వర్ స్క్రీన్ పై మెరవబోతున్నాడు. అల్లావుద్దీన్ అద్భుతదీపం తరహా సినిమాగా రూపొందుతున్న "మై డియర్ భూతం" లో ప్రభుదేవా జీనీ గా కనిపించనున్నాడు. సోమవారం ప్రభుదేవా ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేసిన మేకర్స్ తాజాగా 'మాస్టర్... ఓ మై మాస్టర్' అనే సాంగ్ ను రిలీజ్ చేసారు. ఈ ఫాస్ట్ బీట్ సాంగ్ కు ప్రభుదేవా వేసిన సూపర్ స్టైలిష్ స్టెప్పులు కనురెప్ప వెయ్యనివ్వనంత అద్భుతంగా ఉన్నాయి.
ఈ సినిమా మొత్తం ఒక చిన్న పిల్లాడికి, జీనీకి మధ్య సాగే అద్భుతమైన ప్రయాణం. కోలీవుడ్ డైరెక్టర్ రాఘవన్ ఈ సినిమాకు దర్శకుడు. శ్రీ లక్ష్మి జ్యోతి క్రియేషన్స్ పతాకంపై రమేష్ పి పిళ్ళై ఈ సినిమాను నిర్మించారు. ఇమ్మాన్ ఈ సినిమాకు సంగీతమందించారు. ప్రభుదేవా తో పాటు ఈ సినిమాలో సంయుక్త, ఇమ్మాన్ అన్నచి, సురేష్ మీనన్ తదితరులు నటించారు.