బాలీవుడ్ మాజీ ప్రేమ జంట రణ్ బీర్ కపూర్, దీపికా పదుకొణె ఒకప్పుడు కలిసి సినిమాలు చేసారు. వెకేషన్లకెళ్లారు. పార్టీలు ఎంజాయ్ చేసారు. అంతాబాగానే ఉంది కదా ఇంకేముంది త్వరలోనే పెళ్లి పీటలెక్కుతారనుకునే క్రమంలో, ఇద్దరూ విడిపోయినట్టు వార్తలు వచ్చాయి. ఈ వార్త ఇద్దరి స్టార్ల ఫ్యాన్స్ ను తీవ్రంగా నిరాశపరిచింది. ఇక అప్పటినుండి వీరిద్దరూ కలిసి ఏ సినిమాలోనూ నటించలేదు.
తాజాగా రణ్ బీర్ కపూర్ నటించిన కొత్త సినిమా "బ్రహ్మాస్త్ర" లో దీపికా పదుకొణె నటించిందని కొంతమంది నెటిజన్లు సాక్ష్యాలతో సహా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. అయాన్ ముఖర్జీ డైరెక్షన్లో పాన్ ఇండియా సినిమాగా భారీ బడ్జెట్టుతో తెరకెక్కిన ఈ సినిమాలో రణ్ బీర్, ఆలియాభట్ కలిసి నటించారు. అమితాబ్ బచ్చన్, నాగార్జున, మౌనిరాయ్ కీలకపాత్రలు పోషించారు. గత వారంలో బ్రహ్మాస్త్ర ట్రైలర్ ను రిలీజ్ చేసిన మేకర్స్ ఫ్రెష్ గా ఆదివారంనాడు 4కే ట్రైలర్ ను రిలీజ్ చేసారు. ఈ ట్రైలర్ లో మనోళ్లు షారుఖ్ ను గతంలోనే కనిపెట్టగా, బిట్ టు బిట్ పట్టిపట్టి చూసిన కొంతమంది ఆ ట్రైలర్ లో దీపికా కూడా ఉందని చెప్తున్నారు. నీటికి అధిపతి ఐన జైదేవి పాత్రలో దీపికా నటిస్తుందని చెప్తున్నారు. నెటిజన్లు పోస్ట్ చేస్తున్న ఫోటోలను బట్టి ఆమె దీపికా అయ్యే చాన్సులే ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఎగసిపడే సముద్రం ముందు నడుచుకుంటూ వస్తున్న ఆ లేడి ఆలియా కాదు, మౌని రాయ్ కూడా కాదు.