ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ప్రాజెక్ట్ కే. సైంటిఫిక్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందుతున్న ఈ సినిమాలో దీపికా పదుకొణేతో పాటుగా మరో బాలీవుడ్ భామ కథానాయికగా నటించబోతున్నది. ఆమె ఎవరంటే...బాహుబలి సినిమాతో పాన్ ఇండియన్ స్టార్గా మారిపోయారు ప్రభాస్. ఈ సినిమా తర్వాత అతడి సరసన నటించేందుకు బాలీవుడ్ హీరోయిన్లు ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్ మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్ట్ కే అనే సినిమా చేస్తున్నారు. సైంటిఫిక్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ సొగసరి దీపికా పదుకొణే కథానాయికగా నటిస్తోంది.
తాజాగా ఈ సినిమా కోసం మరో బాలీవుడ్ భామను చిత్ర యూనిట్ ఎంపికచేసింది. దిశాపటానీ ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్గా నటించనున్నట్లు తెలిపారు. ప్రాజెక్ట్ కే సినిమాలోకి చిత్ర యూనిట్ తనకు స్వాగతం పలుకుతూ అందించిన బహుమతిని దిశాపటానీ ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. వరుణ్తేజ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన లోఫర్ సినిమాతో దిశాపటానీ టాలీవుడ్లో అడుగుపెట్టింది. ఈ సినిమాతోనే ఆమె నట ప్రయాణం ప్రారంభమైంది ఎం.ఎస్.ధోనీ, భాఘీ సిరీస్ సినిమాలతో బాలీవుడ్లో చక్కటి విజయాల్ని అందుకున్నది. ప్రాజెక్ట్ కే తో ఏడేళ్ల విరామం తర్వాత ఆమె మళ్లీ టాలీవుడ్లోకి రీఎంట్రీ ఇవ్వబోతుండటం ఆసక్తిని పంచుతోంది. ఆమె పాత్ర ఏమిటనేది మాత్రం చిత్రయూనిట్ వెల్లడించలేదు.
ఈ సినిమాలో బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్బచ్చన్ కీలక పాత్రను పోషిస్తున్నారు. ఫిబ్రవరి నెలలో అమితాబ్బచ్చన్, ప్రభాస్లపై రామోజీ ఫిల్మ్సిటీలో కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. వైజయంతీ మూవీస్ పతాకంపై అశ్వినీదత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దాదాపు నాలుగు వందల కోట్ల వ్యయంతో ఈసినిమా తెరకెక్కుతున్నట్లు సమాచారం.