టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కిస్తున్న భారీ పాన్-ఇండియన్ చిత్రం "లైగర్". పాన్ ఇండియా లెవెల్లో ప్లాన్ చేసిన ఈ సాలిడ్ యాక్షన్ ఎంటర్టైనర్ పై మంచి అంచనాలు నెలకొనగా రీసెంట్ గా మేకర్స్ ఒక సాలిడ్ అప్డేట్ పై టీజ్ చేస్తూ వచ్చారు. మే 9 సాయంత్రం 4 గంటలకు అప్డేట్ను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అయితే అప్పుడు పెద్దగా వివరాలు బయటికి రాలేదు. దీంతో అసలు అప్డేట్ ఏమిటనే దానిపై కొంత గందరగోళం నెలకొంది. అయితే ఇప్పుడు దీనిపై కాస్త క్లారిటీ వచ్చింది.
విజయ్ దేవరకొండ యాటిట్యూడ్పై రూపొందించిన ప్రత్యేక లిరికల్ థీమ్ వీడియోను విడుదల చేస్తున్నట్లు మేకర్స్ చెప్పారు. మరి ఎలా ఉంటుందో చూడాలి. అనన్య పాండే కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం ఆగస్ట్ 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.