టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన సినిమా 'సర్కారువారిపాట'. పరశురామ్ డైరెక్షన్లో పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కింది.ఈ సినిమాలో కీర్తిసురేష్ కధానాయిక. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ యూసుఫ్గూడాలోని పోలీస్ గ్రౌండ్స్లో జరుగుతుంది.
ఈ కార్యక్రమంలో మహేష్ బాబు మాట్లాడుతూ మీ అందరిని ఇలా చూడటం చాలా ఆనందంగా ఉంది.ఈ సినిమాలో నా క్యారెక్టర్ని అద్భుతంగా డిజైన్ చేసిన దర్శకుడికి ధన్యవాదాలు. ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు చేస్తున్నప్పుడు పోకిరి రోజులు గుర్తుకొచ్చాయి.ఈ సినిమాలో చాలా హైలైట్స్ ఉన్నాయి. ఈ సినిమాలో కీర్తి చాలా కొత్తగా చేసింది.నేను తమన్ బీజీఎంకు పెద్ద అభిమానిని.. ఈ సినిమాకు పనిచేసిన టెక్నీషియన్స్ అందరికీ ధన్యవాదాలు. శేఖర్ మాస్టర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు.కరోనా కారణంగా ఈ రెండేళ్లు నాకు చాలా దూరంలో ఉన్నాయి. నాకు అత్యంత సన్నిహితులు దూరమయ్యారు. ఏం జరిగినా నాపై మీ అభిమానం మారలేదు అని మహేష్ బాబు అన్నారు.