సోషల్ మీడియాలో వివిధ అంశాలపై పోస్టులు పెడుతున్న తెలుగుదేశం పార్టీ శ్రేణులని పోలీసులు వేధిస్తున్నారని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. పోస్టులు పెడుతున్న వారిపై సీఐడీ వేధింపులను ఖండించారు.. తాజాగా ఈ అంశంపై డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డికి చంద్రబాబు లేఖ రాశారు. గార్లపాటి వెంకటేశ్వరరావు, మోకర్ల సాంబశివరావులను సీఐడీ అధికారులు అక్రమంగా అదుపులోకి తీసుకున్నారు అని చంద్రబాబు నాయుడు తెలిపారునోటీసుల పేరుతో సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న వారిని ఇబ్బంది పెట్టడం తగదని.. ఇది సుప్రీం తీర్పుకు విరుద్ధమని స్పష్టం చేశారు.సీఐడీ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.