సినిమా డెస్క్: టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ త్రిపాత్రాభినయంలో చేస్తున్న సినిమాపై ఫ్యాన్స్ ఇప్పటి నుంచే ఎన్నో ఆశలు పెంచేసుకుంటున్నారు. అందులోనూ స్టార్ డైరెక్టర్ అయిన బాబీ ఈ ప్రాజెక్ట్ ని డీల్ చేస్తుండటంతో ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోతున్నాయి. అందుకే, ఈ సినిమా గురించి ఎలాంటి న్యూస్ బయటకి వచ్చినా అది క్షణాల్లో వ్యాప్తిస్తోంది.ఇప్పటికే ఈ సినిమాలో హీరోయిన్ గా రాశీఖన్నాని తీసుకున్నారని వార్తలు వినిపించాయి. బాలీవుడ్ లో కింగ్ కెమెరా మాన్ అయిన సి.కె మురళీ ధరన్ ఈ ప్రాజెక్టుకు పనిచేయనున్న సంగతి తెలిసిందే. త్రీ ఇడియట్స్, పీకె సినిమాల్లో తన ఫోటోగ్రఫీతో సత్తా చాటాడు ఈ సినిమాటోగ్రాఫర్. అంతటి క్రేజ్ ఉన్న ఈ సినిమాను కళ్యాణ్ రామ్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ప్రిస్టేజ్గా తీసుకుని తెరకెక్కిస్తున్నాడు.అయితే, ఇప్పుడు లేటెస్ట్ సమాచారం ఏంటంటే.. ఈ సినిమాలో తారక్ రోల్ చాలా డిఫరెంట్ గా ఉండనున్నట్లుగా తెలుస్తోంది. దీనికోసం స్పెషల్ గా ఎన్టీఆర్ తన బాడీ లాంగ్వేజ్ ని మార్చుకుంటున్నాడు. మీసాలు తీసేసి, జుట్టు వెనక్కి పెంచి లాల్చి పైజమాలో స్పెషల్ లుక్ తో కనిపిస్తాడని తెలుస్తోంది. ఇద్దరు ట్విన్స్ అయితే, మరొక పాత్ర ఏంటనేది తెలియాల్సి ఉంది. ఈ సినిమాకి ‘జై లవకుశ’ అనే టైటిల్ ని పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.నాన్నకు ప్రేమతో సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ రేంజ్ మారిపోయిందని, ఈ సినిమా నుంచి స్టోరీ సెలక్షన్స్ లో కానీ, పాత్రల విషయంలో కానీ, గెటప్లో కానీ ఎన్టీఆర్ కొత్తగా కనిపిస్తున్నాడని చెప్తున్నారు అందరూ. ఆ సినిమా నుంచే ఎన్టీఆర్ తన ఓవర్సీస్ మార్కెట్ని కూడా పెంచుకుని వందకోట్ల క్లబ్ లోకి చేరాడని ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. ఈ సినిమాతో ఖచ్చితంగా టాలీవుడ్లో వైవిధ్యమైన నటన శైలిని ప్రదర్శిస్తాడని కాలర్ ఎగరేసి మరీ చెప్తున్నారు.