తమిళనాడు: తమిళనాడులో రెండాకుల గుర్తుపై వివాదం ఇంకా కొనసాగుతోంది. రెండాకుల గుర్తుపై ఈసీ నిర్ణయాన్ని టీటీవీ దినకరన్ ఢిల్లి హైకోర్టులో సవాల్ చేశారు. రెండాకుల గుర్తును ఇటీవల పళనిస్వామి-పన్నీర్సెల్వం వర్గానికి కేటాయిస్తూ ఈసీ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో టీటీవీ దినకరన్ ఈసీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.