తమిళనాడు: తమిళనాడులోని పలు ప్రాంతాల్లో ఇవాళ భారీ వర్షం కురిసింది. కన్యాకుమారి జిల్లాలో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. ఈదురుగాలుల ప్రభావానికి సుమారు 50 వృక్షాలు విరిగిరోడ్లపై పడ్డాయి. రెండు ప్రాంతాల్లో మొబైల్ టవర్స్ కుప్పకూలిపోయాయి. అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం సహాయక చర్యలను కొనసాగిస్తున్నది. రానున్న 24 గంటల్లో చెన్నై, లక్ష్యద్వీప్ ప్రాంతాల్లో భారీవర్ష సూచన నేపథ్యంలో ఐఎండీ సైక్లోన్ తుఫాన్ హెచ్చరికలు జారీచేసింది. సైక్లోన్ ప్రభావంతో ఏడు జిల్లాల్లో విద్యాసంస్థలకు తమిళనాడు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది.