హైదరాబాద్ కేంద్రంగా ఉన్న టర్బో మెగా ఎయిర్వేస్ కు చెందిన ట్రూజెట్ కడప-చెన్నై మధ్య విమాన సర్వీసులను గురువారం ప్రారంభించింది. ఎయిర్పోర్టు డైరెక్టర్ శివప్రసాద్ చెన్నైకి వెళ్లే ప్రయాణికులకు బోర్డింగ్ పాస్ ఇచ్చి సాదరంగా ఆహ్వానించారు. ఇప్పటికే ఈ సంస్థ కడప-హైదరాబాదు మధ్య సర్వీసు నడుపుతోంది. చెన్నైకి విమాన సర్వీసు అందుబాటులోకి రావడంతో కడప జిల్లా వాసులతో పాటు కర్నూలు, అనంతపురం జిల్లావాసులకు ఉపయోగకరం కానుంది.