దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు శుక్రవారం తాజాగా తీసుకున్న నిర్ణయంతో ఐపీఎల్ ఫ్రాంచైజీలు సంతోషంలో మునిగిపోయాయి. ఇటీవల ఐపీఎల్ జరిగే సమయంలోనే బంగ్లాదేశ్తో స్వదేశంలో టెస్టు సిరీస్ను బోర్డు ప్రకటించింది. ఆటగాళ్లందరూ తప్పనిసరిగా జాతీయ జట్టుకు ఆడాలని అప్పట్లో ఆదేశించింది. ఈ క్రమంలో ఐపీఎల్లో కీలక ఆటగాళ్లైన కగిసో రబాడా, లుంగి ఎంగిడి, మార్కో జాన్సన్, మార్క్రమ్, వాన్డెన్ హుస్సేన్ వంటి దక్షిణాఫ్రికా క్రికెటర్లు కనిపించరని ఫ్రాంచైజీలు ఆందోళన చెందాడు. అయితే తాజాగా క్రికెట్ సౌత్ ఆఫ్రికా కీలక నిర్ణయం తీసుకుంది. స్వదేశంలో బంగ్లాదేశ్తో తలపడే 150 మంది జట్టు సభ్యులను ప్రకటించింది. ఐపీఎల్లో ఆడుతున్న కగిసో రబాడా, లుంగి ఎంగిడి, మార్కో జాన్సన్, మార్క్రమ్, వాన్డెన్ హుస్సేన్లను టెస్టు జట్టు నుంచి తప్పించింది. వారు కావాలనుకుంటే ఐపీఎల్ ఆడొచ్చని తెలిపింది. మార్కో జాన్సెన్ను ఇటీవల ఐపీఎల్ వేలంలో సన్రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేయగా, రబాడాను పంజాబ్ జట్టు దక్కించుకుంది. ఎంగిడిని ఢిల్లీ క్యాపిటల్స్ సొంతం చేసుకుంది. అయితే దక్షిణాఫ్రికాకే చెందిన అన్రిచ్ నార్జే కూడా ఢిల్లీ క్యాపిటల్స్కు ఆడనున్నాడు. ప్రస్తుతం గాయంతో బాధపడుతుండడంతో అతడు ఆడేదీ లేనిదీ స్పష్టం కాలేదు.