ఉక్రెయిన్పై రష్యా దురాక్రమణ మొదలు పెట్టి 23 రోజులు అవుతోంది. ఈ క్రమంలో రష్యాతో సాగుతున్న భీకర పోరులో 14,200ల మంది ఆ దేశ సైనికులను హతమార్చినట్లు ఉక్రెయిన్ రక్షణశాఖ శుక్రవారం వెల్లడించింది. అంతేకాకుండా ఇప్పటి వరకు 450 యుద్ధ ట్యాంకులు, 93 ఫైటర్ జెట్లు, 112 హెలికాప్టర్లు, 43 విమాన నిరోధక వ్యవస్థలను ధ్వంసం చేసినట్లు వెల్లడించింది. ఇదిలా ఉండగా ఉక్రెయిన్లోని ల్వీవ్ నగరంపై తొలిసారి రష్యా క్షిపణి దాడులకు పాల్పడింది. శుక్రవారం ఉదయం నుంచే స్థానిక ఎయిర్పోర్టు లక్ష్యంగా రష్యా సేనలు క్షిపణి దాడులతో విరుచుకుపడుతోంది. అయితే ఈ దాడుల్లో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని ల్వీవ్ మేయర్ ఆండ్రీ సాదోవ్య్ వెల్లడించారు. అయితే కీవ్ నగరంలోని ఓ భవనంపై రష్యా సైనికులు క్షిపణిని ప్రయోగించారు. ఒకరు మృతి చెందగా, నలుగురు గాయపడినట్లు తెలుస్తోంది. 12 మందిని ప్రమాదం నుంచి రక్షించామని, భవనంలో నివసిస్తున్న 98 మందిని అక్కడి నుంచి ఖాళీ చేయించినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు.