ముంబై : ముంబై కర్ఘర్ ప్రాంతంలో ఆదివారం సాయంత్రం దారుణం జరిగింది. ఓ ప్రైవేటు సంస్థలో పని చేస్తున్న మహిళ తన విధులు ముగించుకుని స్కూటీపై ఇంటికి తిరుగు ప్రయాణమైంది. రోడ్డుపై వస్తుండగా స్కూటీ అదుపుతప్పింది. దీంతో మహిళ రోడ్డుపై పడిపోయింది. రోడ్డుపై పడిపోయిన మహిళపై నుంచి క్రేన్ను పోనిచ్చాడు. ఈ ప్రమాదంలో మహిళ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. మృతురాలిని సుజాత పూరి(34)గా పోలీసులు గుర్తించారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా క్రేన్ డ్రైవర్ను పోలీసులు అరెస్టు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.