భోపాల్ : మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లోని తాలియా పోలీసు స్టేషన్ పరిధిలో రోడ్డుప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన కారు అదుపుతప్పి పాదాచారులపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. ఒక చిన్నారి స్వల్పంగా గాయపడింది. అయితే ప్రమాదం జరిగిన తర్వాత.. పాదాచారులను ఢీకొట్టిన కారుతో సహా డ్రైవర్ తక్షణమే అక్కడ నుంచి పారిపోయారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు స్థానికులు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.