చిత్తూరు: తంబళ్లపల్లె ప్రభుత్వ జూనియర్ కళాశాలలో న్యాయ విజ్ఞాన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా న్యాయమూర్తి భరత్ చంద్ర పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ విద్యార్థినులకు చట్టాలపై అవగాహన కలిగించడానికి ప్రిన్సిపల్ కృషిచేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రామకృష్ణ, న్యాయవాది గఫుర్, ప్రిన్సిపల్, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.