చిత్తూరు: ములకలచెరువు స్థానిక కదిరి రోడ్డు వైపు ఉన్న దుకాణాల వెనుక భాగంలో గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో మంటలు వ్యాపించాయి. రైల్వే స్టేషన్ వెనుక వైపు ఆవరణంలో మంటలు వ్యాపించడంతో స్థానికులు అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది, పోలీసు సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేయడంతో భారీ ప్రమాదం తప్పింది.