కర్నూల్ జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలోని స్థానిక లక్ష్మి పేట కు చెందిన హీరో హోండా ద్విచక్ర వాహనానికి దుండగులు పెట్రోల్ పోసి నిప్పంటించినట్లు బాధితుడు బాషా (కమల్) తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ. మంగళవారం రాత్రి తనతో పాటు కుటుంబ సభ్యులు నిద్రలో ఉండగా అర్ధరాత్రి సమయంలో ఇంటి బయట ఉన్న వాహనాన్ని పెట్రోల్ పోసి నిప్పు పెట్టినట్ల తెలిపారు. దీంతో రూ. 60వేలు నష్టం సంభవించినట్లు ఆయన చెప్పారు. ఈ విషయంపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.