విధి నిర్వహిణలో ఎన్ని ఆటంకాలు, సవాళ్లు ఎదురైనా ఓర్పుతో అధికమిస్తూ లక్ష్యాన్ని చేరుకోవాలని నిరూపించి ఇస్వీ పోలీసు స్టేషన్ ఎస్ఐ విజయలక్ష్మీ మహిళా లోకానికి ఆదర్శంగా నిలిచారు. ఆదోని మండలంలోని నారాయణపురం గ్రామ పొలాల్లో వేటగాళ్లు 11 జింకలను చంపిన ఘటనపై విచారణకు వెళుతుండగా జీపు పొలాల్లో ఇరుక్కుపోయింది. సిబ్బందితోపాటు ఎస్ఐ కూడా జీపును ముందుకు నెట్టి విచారణకు వెళ్లి మహిళ కూడా ఎందులోనూ తీసిపోరని నిరూపించారు.