వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్చాలంటూ కర్నూలు నగరంలో కలెక్టరేట్ ఎదుట రోడ్డుపై చేపట్టిన ఆందోళన స్వల్ప ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. రిజర్వేషన్లు కోరుతూ వాల్మీకి రిజర్వేషన్ పోరాట సమితి (వీఆర్పీఎస్) ఆధ్వర్యంలో తొలుత రోడ్డుపై బైఠాయించారు. ప్రభుత్వం తమకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సుభాష్ చంద్రబోస్ డిమాండ్ చేశారు. కలెక్టరేట్ ఎదుట బైఠాయించడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో పోలీసులు వారిని నిలువరించేందుకు ప్రయత్నించగా.. ఇరు వర్గాల మధ్య తోపులాట చోటుచేసుకుంది. ఈ క్రమంలో బస్సు, ఆటో అద్దాలను ఆందోళన కారులను ధ్వంసం చేశారు. పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు.