ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ధోని తర్వాత ఆ స్థానాన్ని అతనే భర్తీ చేయగలడు

national |  Suryaa Desk  | Published : Wed, Dec 01, 2021, 12:49 PM

చెన్నై సూపర్‌ కింగ్స్‌ యాజమాన్యం నలుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకున్న విషయం తెలిసిందే. ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా (రూ.16 కోట్లు), ధోని (12 కోట్లు), మొయీన్ అలీ (రూ.8 కోట్లు)‌, రుతురాజ్‌ గైక్వాడ్(రూ. 6 కోట్లు)లను రిటెయిన్ చేసుకుంది. అయితే జడేజాను మొదటి ప్రాధాన్య ఆటగాడిగా ఎంచుకోవడంతో ధోని తర్వాత జడేజా కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు.


ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా సత్తా ఏంటో చెన్నై కెప్టెన్ ధోనికి తెలుసని భారత మాజీ క్రికెటర్ రాబిన్‌ ఉతప్ప అన్నాడు. అందుకే ధోని తన రిటైర్మెంట్ తర్వాత చెన్నై పగ్గాలను జడేజాకే అప్పగిస్తాడని అనుకుంటున్నానని పేర్కొన్నాడు. ధోని తనకు తానే రెండో ప్రాధాన్య ఆటగాడిగా కొనసాగాలని నిర్ణయించుకున్నాడని తెలిపాడు. ఈ వ్యాఖ్యలను మరో మాజీ క్రికెటర్ పార్థివ్‌ పటేల్ కూడా సమర్థించాడు. ధోని తర్వాతి కెప్టెన్‌గా జడేజానే సరైనోడనిపిస్తోందని పార్థివ్‌ పటేల్ అన్నాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com