ఢిల్లీ ప్రభుత్వం బుధవారం రెడ్యూస్డ్ వాల్యూ యాడెడ్ ట్యాక్స్ ను 30శాతం నుంచి 19.40శాతానికి తగ్గించింది. ఫలితంగా పెట్రోల్ ధరల్లో మార్పు కనిపిస్తూ.రూ.8తగ్గింది. డిసెంబర్ 1 అర్ధరాత్రినుంచే ఈ ధరలు అమల్లోకి వస్తాయని స్పష్టం చేశారు. ఇదిలా ఉంచితే 27రోజులుగా ఇందన ధరల్లో హెచ్చుతగ్గులు లేకపోవడం విశేషం. రికార్డ్ స్థాయికి పెరిగిన తర్వాత నవంబర్ 4వ తేదీ నుంచి కొంత మేర మాత్రమే తగ్గాయి.ప్రస్తుతం ఢిల్లీలో పెట్రోల్ లీటర్ రూ.103.97కు అమ్ముతుంటే, డీజిల్ రేట్ రూ.86.67గా ఉందని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ చెప్తుంది. ముంబైలో లీటర్ పెట్రోల్ రూ.109.98ఉంటే, డీజిల్ ధర లీటర్ రూ.94.14గా అమ్ముడవుతుంది.