ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలి : ఎమ్మెల్యే గోరంట్ల

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Feb 21, 2017, 11:33 AM

కడియం : టీడీపీ కార్యకర్తలు, నాయకులు సమన్వయంతో పనిచేయాలని గ్రూపులుగా విడిపోయి వివాదాలకు తావిస్తే ఊరుకునేది లేదని రూరల్‌ ఎమ్మెల్యే, రాష్ట్ర టీడీపీ ప్రధాన కార్యదర్శి గోరంట్ల బుచ్చియ్యచౌదరి పేర్కొన్నారు. గ్రూపు రాజకీయాలకు కేంద్రంగా ఉన్న కడియం మండలం దుళ్ల గ్రామ టీడీపీ ఎన్నికలకు సోమవారం ఆయన ముఖ్యఅతిధిగా విచ్చేసారు. ఆ గ్రామంలో వైకాపా బలంగా ఉండడం, టీడీపీ గ్రూపులుగా విడిపోయి వివాదాలు సాగుతుండడంతో ఆయనే స్వయంగా ఈ గ్రామకమిటీ ఎన్నికల్లో పాల్గొన్నారు. ఈసందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రూపు రాజకీయాలతో పార్టీని భ్రస్టుపట్టించడం సరికాదన్నారు. దుళ్ళ గ్రామం మండలపరిషత్‌, అసెంబ్లిd ఎన్నికల్లోనూ టీడీపీ వెనకబడి పోయిందని 850వరకు వైకాపాకు మెజార్టీ వచ్చినప్పటికీ తాను గ్రామంపై కక్ష పెంచుకోకుండా అభివృద్దికి నిధులు కేటాయిస్తున్నానన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com