ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేటి నుంచి ఏపీలో కర్ఫ్యూ వేళల్లో మార్పులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jun 11, 2021, 12:06 PM

ఏపీలో కరోనా కట్టడికి ప్రభుత్వం కర్ఫ్యూ అమలు చేస్తోంది. ఇవాళ్టి నుంచి కర్ఫ్యూ వేళల్లో పలు మార్పులు చేసింది ఏపీ సర్కార్. ఈ నెల 20 వరకు కర్ఫ్యూ ఆంక్షలు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీచేసిన ప్రభుత్వం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కర్ఫ్యూ నుంచి సడలింపులు ఇచ్చింది. గతంలో ఈ సమయం ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకు ఉండగా.. ఇప్పుడు సడలింపు సమయాన్ని మరో రెండు గంటల పాటు పెంచింది. ఇక మధ్యాహ్నం 2 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా కర్ఫ్యూ అమలు కానుంది. ప్రజలు నిబంధనలు ఉల్లంఘించి రోడ్లపైకి వస్తే కఠిన చర్యలు తప్పవని జగన్‌ సర్కార్‌ హెచ్చరించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com